విశాఖకు రైల్వే జోన్ రాకపోతే... రాజీనామా చేస్తా
విశాఖకు రైల్వే జోన్ రాకపోతే రాజీనామా చేస్తానని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ రైల్వే జోన్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నిన్నటి సమావేశంలో రైల్వే జోన్ అంశమే చర్చకు రాలేదన్నారు. విశాఖకు రైల్వే జోన్ వచ్చి తీరుతుందన్నారు. సీఎం జగన్ ప్రభుత్వపై అక్కసుతోనే ఎల్లో మీడియా తప్పుడు రాతలు రాస్తోందని దుయ్యబట్టారు. రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపిందని, విభజన చట్టంలో రైల్వే జోన్ గురించి స్పష్టంగా చెప్పారన్నారు.
Tags :