Radha Spaces ASBL

ఆ విషం ముఖ్యమంత్రి, డీజీపీలకు తెలియదా? : వర్ల రామయ్య

ఆ విషం ముఖ్యమంత్రి, డీజీపీలకు తెలియదా? : వర్ల రామయ్య

గుడివాడలో క్యాసినో విషం ముఖ్యమంత్రి, డీజీపీలకు తెలియదా? అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సంస్కృతిక, సాంప్రదాయాలకు నిలయమైన ఆంధ్రప్రదేశ్‌లో విషసంస్కృతి నాటుతారా? అని ప్రశ్నించారు. క్యాసినోలు, క్యాబరే డ్యాన్సులతో రాష్ట్రం పరువు తీస్తారా అని మండిపడ్డారు. నాడు ఎన్టీఆర్‌ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పారు. నేడు జగన్‌ మోహన్‌ రెడ్డి హయంలో తెలుగు సంస్కృతిపై దాడి జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగువారి సంస్కవృతి, సంప్రాదాయాలపై దాడిని తెలుగు ప్రజలంతా ఎదుర్కోవాలన్నారు. 

సంక్రాంతి సందర్భంగా రూ.250 కోట్ల రూపాయలు చేతులు మారాయని మండిపడ్డారు. అసాంఘిక కార్యకలాపాలు కళ్లెదుట జరుగుతున్నా బాధ్యులపై చర్య తీసుకోలేని డీజీపీ పరిస్థితి చూస్తే జాలేస్తోందన్నారు. పోలీస్‌ వ్యవస్థన అధ పాతాళానికి దిగజార్చిన ఘనత డీజీపీ సవాంగ్‌కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. చర్యలు తీసుకోకపోతే ముఖ్యమంత్రి, డీజీపీ అండతోనే తెలుగు సంస్కృతిపై దాడి జరిగినట్లు భావిస్తామని అన్నారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :