ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

చార్ ధామ్ యాత్రకు వచ్చే భక్తులకు కీలక సూచన

చార్ ధామ్ యాత్రకు వచ్చే భక్తులకు కీలక సూచన

ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్‌ యాత్రకు ఈసారి భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో మంచు కొండల్లో ప్రయాణానికి కొంత అసౌకర్యం కలుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చార్‌ధామ్‌ యాత్రకు వచ్చే భక్తులకు ఉత్తరాఖండ్‌ పోలీసులకు కీలక సూచన చేశారు. సామర్థ్యం కంటే అనేక రెట్లు ఎక్కువగా చార్‌ ధామ్‌ దర్శనానికి భక్తులు వస్తున్నారని అన్నారు. నవంబర్‌ వరకు ఈ యాత్ర కొనసాగుతున్నందున అందుకు అనుగుణంగా భక్తులు తమ దర్శన సమయాన్ని మార్చుకోవాలని విజ్ఞప్తి చేశారు.  ఏప్రిల్‌ 25 నుంచి ఇప్పటివరకు కేదార్‌నాథ్‌ను 6 లక్షల మంది సందర్శించారు. బద్రీనాథ్‌ తెరిచినప్పటి నుంచి 5 లక్షల మంది దర్శించుకున్నారు. కాగా కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌ ఆలయాలను నిత్యం సరాసరి 20 వేల మంది సందర్శిస్తున్నారని, కానీ అక్కడి సామర్థ్యం రోజుకే కేవలం 10 వేలు మాత్రమేనని అన్నారు. ఇలా సామర్థ్యానికి మించి విపరీతమైన సంఖ్యలో భక్తులు వస్తోన్న నేపథ్యంలో ఉత్తరాఖండ్‌ పోలీసులకు కీలక సూచనలు చేశారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :