Radha Spaces ASBL

భారత్-అమెరికా మధ్య సత్సంబంధాలు

భారత్-అమెరికా మధ్య సత్సంబంధాలు

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. అదే విధంగా వివిధ దేశాధినేతలు, ప్రధానమంత్రులు భారత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భారత్‌తో బలమైన స్నేహాన్ని కొనసాగిస్తామని ఆయా నేతలు పునరుద్ఘాటించారు. బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయంలో త్రివర్ణ పతకాన్ని ఎగురవేశారు. సింగపూర్‌లోని హైకమిషన్‌ కార్యాలయంలోనూ భారత గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించారు. వాషింగ్టన్‌లోని శ్వేతసౌధంలో జరిగిన కార్యాక్రమంలో ప్రెస్‌ సెక్రటరీ జెన్‌ సాకి మాట్లాడుతూ  భారత్‌, అమెరికాల మధ్య ఉన్న సత్సంబంధాలు ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టడానికి దోహదపడతాయన్నారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :