Radha Spaces ASBL

కీలక నిర్ణయాలు తీసుకున్న టీటీడీ ... బ్రహ్మోత్సవాల సమయంలో

కీలక నిర్ణయాలు తీసుకున్న టీటీడీ ... బ్రహ్మోత్సవాల సమయంలో

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణ, తిరుమలకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని పలు నిర్ణయాలు తీసుకున్నట్లు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సమయంలో బ్రేక్‌ దర్శనాల్లో మార్పులు చేశామని, ప్రయోగాత్మకంగా ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు బ్రేక్‌ దర్శనాలు ఉంటాయన్నారు.  బ్రహ్మోత్సవాల అనంతరం టైమ్‌స్లాట్‌ టోకెన్ల జారీ ప్రారంభించనున్నట్లు తెలిపారు. తిరుపతిలో సర్వదర్శన టోకెన్లు జారీ చేయనున్నారని, ప్రాథమికంగా రోజుకు 20 వేల చొప్పున సర్వదర్శన టోకెన్లు జారీ చేస్తామన్నారు. తిరుమల గధుల కేటాయింపులోనూ మార్పులు చేసినట్లు తెలిపారు. తిరుమలలో వసతి గధుల కేటాయింపు తిరుపతిలోనే చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :