శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్ కు ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి సీఎం కార్యాలయంలో కలిశారు. సీఎం జగన్కు ప్రసాదాలు, శేష వస్త్రాలు అందజేశారు. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5 వరకు శ్రీవెంకటేశ్వరస్వామి బ్రహోత్సవాలు జరగనున్నాయి. స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు హాజరై, రాష్ట్ర ప్రజల తరపున పట్టు వస్త్రాలు సమర్పించాల్సిందిగా ముఖ్యమంత్రికి ఆహ్వాన పత్రం అందజేశారు.
Tags :