ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు తీపికబురు

టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు తీపికబురు

టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు యాజమాన్యం తీపి కబురు చెప్పింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కానుకగా మరో విడత కరవు భత్యం (డీఏ) ఇవ్వాలని నిర్ణయించినట్లు టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్థన్‌, ఎండీ వీసీ సజ్జనార్‌లు వెల్లడించారు. జులై 2022లో ఇవ్వాల్సిన ఉన్న 4.9 శాతం డీఏను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. జూన్‌ నెల వేతనంతో కలిపి డీఏను ఉద్యోగులకు సంస్థ చెల్లిస్తుందని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ  దశాబ్ది ఉత్సవాల కానుకగా పెండింగ్‌లో ఉన్న ఏడో డీఏను ఉద్యోగులకు మంజూరు చేయాలని టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించిందని వారు ప్రకటించారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ ఇప్పటి వరకు ఏడు డీఏలను సంస్థ మంజూరు చేసింది. మిగిలిన ఒక్క డీఏను త్వరలోనే ఉద్యోగులకు ప్రకటిస్తుందని బాజిరెడ్డి గోవర్థన్‌, సజ్జనార్‌ లు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులు క్రియాశీలక పాత్ర పోషించారు. 2011లో దాదాపు 29 రోజుల పాటు సకల జనుల సమ్మెలో పాల్గొని ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :