Radha Spaces ASBL

బీఎల్ సంతోష్‌కు హైకోర్టులో ఊరట

బీఎల్ సంతోష్‌కు హైకోర్టులో ఊరట

బీజేపీ నేత బీఎల్‌ సంతోష్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఎమ్మెల్యేలకు ఎర కేసులో తెలంగాణ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) జారీ చేసిన నోటీసులపై బీజేపీ నేత బీఎల్‌ సంతోష్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు వ్యవహారంలో విచారణకు ఈ నెల 26న లేదా 28న హాజరు కావాలని బీఎల్‌ సంతోష్‌కు సిట్‌ నోటీసులు జారీ చేసింది.  ఈ నోటీసులను రద్దు చేయాలని బీఎల్‌ సంతోష్‌ హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన హైకోర్టు సిట్‌ జారీ చేసిన నోటీసులపై డిసెంబరు 5 వరకు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :