విప్రహిత బ్రాహ్మణ సదన్ ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్పల్లిలో విప్రహిత బ్రాహ్మణ సంక్షేమ సదన్ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ పురవాసుల హితం కోరేవారే పురోహితులు అని అన్నారు. బ్రాహ్మణుల్లోనూ చాలామంది పేదలున్నారని చెప్పారు. బ్రాహ్మణ పరిషత్కు ఏటా రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. విప్రహిత బ్రాహ్మణ సదనాన్ని రూ.12 కోట్లతో నిర్మించాం. బ్రాహ్మణ సదస్ను నిర్మించడంలో దేశంలో ఇదే మొదటిసారి. వేదశాస్త్ర విజ్ఞాన భాండాగారంగా బ్రాహ్మణ సదన్ విలసిల్లాలి. బ్రాహ్మణుల సంక్షేమానికి మా ప్రభుత్వం కృషి చేస్తోంది. రాష్ట్రంలో మరో 2696 దేవాలయాలకు ధూప, దీప, నైవేద్యాల పథకాన్ని వర్తింపజేస్తాం. ఈ పథకం కింద నెలకు ఇచ్చే నిధులను రూ.10 వేలకు పెంచాం. వేదపండితులకు ఇచ్చే గౌరవ భృతిని రూ.2,500 నుంచి 5 వేలకు పెంచాం. అర్హత వయసు 75 నుంచి 65ఏళ్లకు తగ్గించాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, సీఎస్ శాంతికుమారి, ఎంపీ రంజిత్ రెడ్డి, కెప్టెన్ లక్ష్మీకాంతరావు, రాజీవ్శర్మ, కేవీ రమణాచారితో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన పీఠాధిపతులు, పండితులు పాల్గొన్నారు.