జగన్ నాలుగేళ్ల పాలనపై టీడీపీ చార్జిషీట్
నాలుగేళ్ల పాటు ఏపీలో వైసీపీ పాలన ఎలా ఉందో వివరిస్తూ టీడీపీ చార్జిషీట్ విడుదల చేసింది. మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు, పొలిట్ బ్యూరో సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని ప్రతి రంగాన్ని సీఎం జగన్ ఏ విధంగా నీరుగార్చారో ఈ చార్జిషీట్లో టీడీపీ వివరించే ప్రయత్నం చేసింది. ఈ సందర్భంగా నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ, ‘జగన్ ప్రమాణం చేసినప్పుడే రాష్ట్రం అంధకారమైంది. విధ్వంసంతో జగన్ పాలన మొదలైంది. ప్రజలకు పట్టిన పీడ మరొక్క ఏడాదితో విరగడ అవుతుంది. రాష్ట్రంలో వచ్చేది టీడీపీ ప్రభుత్వమే’ అని ధీమా వ్యక్తం చేశారు. ఇదే కార్యక్రమంలో బోండా ఉమ మాట్లాడుతూ.. ఈ చార్జిషీట్పై సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ అన్ని రంగాల్లో ఫెయిలయ్యారని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ మండిపడ్డారు.
Tags :