ఎన్టీఆర్ను ఎవరు గౌరవించినా తాము స్వాగతిస్తాం : చంద్రబాబు
ఎన్టీఆర్ను ఎవరు గౌరవించినా తాము స్వాగతిస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే తామెందుకు వ్యతిరేకిస్తామని అన్నారు. ఎన్టీఆర్ కేవలం ఒక ప్రాంతానికి చెందిన నేత కాదని, ఎన్టీఆర్కు భారత రత్న ఇవ్వాలని టీడీపీ డిమాండ్ చేస్తోందన్నారు. హైదరాబాద్లో ఎయిర్పోర్ట్కి ఎన్టీఆర్ పేరును వైఎస్ఆర్ తొలగించారని విమర్శించారు. రాష్ట్రంలో ఎన్టీఆర్ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని తప్పుబట్టారు. ఎన్టీఆర్ స్మృతి వనం ప్రాజెక్ట్ను నిలిపివేసిన జగన్ రెడ్డి ప్రభుత్వం, ఎన్టీఆర్పై ప్రేముందని చెప్పే ప్రయత్నాన్ని ప్రజలు నమ్మరని తెలిపారు. కడప జిల్లాకు వైఎస్ పేరు పెట్టినా తాము వ్యతిరేకించలేదని గుర్తు చేశారు. టీడీపీకి ద్వంద్వ విధానాలు ఉండవని చంద్రబాబు ప్రకటించారు.
Tags :