ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఉద్యోగులకు టీసీఎస్ హెచ్చరిక.. వారిపై కఠినంగా

ఉద్యోగులకు టీసీఎస్ హెచ్చరిక.. వారిపై కఠినంగా

భారత ఐటీ దిగ్గజ సంస్థ టీసీఎస్‌ వారంలో మూడు రోజుల పాటు ఆఫీసు నుంచే వర్క్‌ చేయాలనే నిబంధన తీసుకొచ్చింది. దీన్ని పాటించని వారిపై కఠినంగా వ్యవహరిస్తామంటూ ఉద్యోగులకు తాజాగా హెచ్చరికలు జారీ చేస్తోంది. వారంలో మూడు రోజులు ఆఫీసుకు రావాలని తమ ఉద్యోగులకు టీసీఎస్‌ గత అక్టోబర్‌ నుంచే సూచిస్తోంది. అలా నెలకు 12 రోజుల పాటు ఆఫీసు నుంచే వర్క్‌ చేయాల్సి  ఉంటుంది. కానీ కొందరు ఉద్యోగులు ఈ నిబంధనను పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.  దీంతో అలాంటి వారికి తాజాగా నోటీసులు పంపించడం మొదలుపెట్టిన టీసీఎస్‌ రోస్టర్‌ ప్రకారం నిర్దేశించిన కార్యాలయానికి తక్షణమే వచ్చి రిపోర్టు చేయాలని సూచించింది. నిబంధనలు ఉల్లంఘించే వారిపై క్రమశిక్షణా చర్యలు తప్పవని ఉద్యోగులకు జారీ చేసిన మెమోల్లో హెచ్చరించినట్లు సమాచారం.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :