విజయవంతంగా తానా ఫౌండేషన్ మెగా ఐ క్యాంప్
విజయవంతముగా ముగిసిన తానా ఫౌండేషన్ మెగా ఐ క్యాంపు. అనంతపురం జిల్లా అరకటివేముల గ్రామం నందు తానా ఫౌండేషన్, పుష్పగిరి హాస్పిటల్ సంయక్తముగా అక్టోబర్ రెండవ(October 2 2022) తేదీ మెగా ఐ క్యాంపు నిర్వహించడం జరిగినది. సుమారు మూడువందల పైగా పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికీ కళ్ళ జోళ్ళు పంచడం జరిగినది. కార్యక్రమానికి హాజరైన గ్రామ పెద్దలు పొత్తూరు నారాయణ గారు, పొత్తూరు బాలరంగయ్య గారు, సాక్ష్యం ఫౌండేషన్ జిల్లా కన్వీనర్ వేణుగోపాల్ సుంకు గారు, డాక్టర్ భీమనేని భానుకిరణ్ గారు తానా చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. ఈ మెగా ఐ క్యాంపు కార్యక్రమానికి పొత్తూరు రవి నాయుడు స్పాన్సర్ చెయ్యడం జరిగినది. తానా ఫౌండేషన్ ట్రస్టీ పురుషోత్తమ చౌదరి గుడే ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తగా వ్యవహరించారు.
ఈ కార్యక్రమం చేయడానికి సహకరించిన తానా ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి గారికి, ఫౌండేషన్ చైర్మన్ వెంకటరమణ యార్లగడ్డ గారికి, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పురుషోత్తం చౌదరి గుడే గారికి ప్రత్యేక కృతఙ్ఞతలు.