Radha Spaces ASBL

ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో టీఎస్‌పీఎస్సీ సంచలన నిర్ణయం

ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో టీఎస్‌పీఎస్సీ సంచలన నిర్ణయం

తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో టీఎస్‌పీఎస్సీ (TSPSC) సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రశ్నపత్రాల లీకేజీతో సంబంధం ఉన్న వారిని వెంటనే డిబార్‌ చేయాలని డిసైడ్ అయింది. ఈ కేసులో 37 మందిని సిట్ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వారెవరూ ఇకపై టీఎస్‌పీఎస్సీ నిర్వహించే ఎలాంటి పరీక్షలు రాయకుండా డిబార్ చేయాలని కమిషన్‌ ఆదేశించింది. ఈ నిర్ణయంపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే రెండు రోజుల్లో తమకు వాటిని తెలియజేయాలని తెలిపింది. ఈ మేరకు 37 మంది నిందితులకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 44 మందిపై కేసు నమోదు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) 43 మందిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :