ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో టీఎస్పీఎస్సీ సంచలన నిర్ణయం
తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో టీఎస్పీఎస్సీ (TSPSC) సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రశ్నపత్రాల లీకేజీతో సంబంధం ఉన్న వారిని వెంటనే డిబార్ చేయాలని డిసైడ్ అయింది. ఈ కేసులో 37 మందిని సిట్ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వారెవరూ ఇకపై టీఎస్పీఎస్సీ నిర్వహించే ఎలాంటి పరీక్షలు రాయకుండా డిబార్ చేయాలని కమిషన్ ఆదేశించింది. ఈ నిర్ణయంపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే రెండు రోజుల్లో తమకు వాటిని తెలియజేయాలని తెలిపింది. ఈ మేరకు 37 మంది నిందితులకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 44 మందిపై కేసు నమోదు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) 43 మందిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
Tags :