ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ

ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ

రాజధాని అమరావతి విషయంలో  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగలింది. కేసు విచారణ త్వరగా చేపట్టాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు కోరగా జులై 11న తొలి కేసుగా విచారణకు తీసుకుంటామని జస్టిస్‌ కేఎం జోసెఫ్‌, జస్టిస్‌ బి.వి. నాగరత్న ధర్మాసనం స్పష్ట  చేసింది. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు మరోసారి కోరగా, స్టే ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది.  పిటిషన్‌ దాఖలు చేసిన వారితో కొంత మంది రైతులు చనిపోయారని ప్రతివాదుల తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. మరణించిన వారి తరపున ప్రతినిధులు ప్రతివాదులుగా ఉండేందుకు అనుమతివ్వాలని న్యాయవాదులు కోరగా అందుకు అనుమతించిన ధర్మాసనం వారికి నోటీసులు పంపాలని ప్రభుత్వ తరపు న్యాయవాదులను  ఆదేశించింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :