ఎస్బీఐ శుభవార్త... వాట్సాప్ ద్వారా
దేశీయ ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ తన ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. త్వరలో వాట్సాప్ ద్వారా బ్యాంకింగ్ సేవల్ని అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. తద్వారా ఎస్బీఐ బ్యాంకింగ్ సేవల్ని మరింత సులభతరం కానున్నాయి. జులై 1న జరిగిన వర్చువల్ మీటింగ్లో ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్బీఐ పలు కొత్త సేవల్ని అందుబాటులోకి తేనున్నట్లు వెల్లడిరచారు. వాటలో ముఖ్యంగా వాట్సాప్లో ఎస్బీఐ బ్యాంకింగ్ సేవలు ఉంటాయని అన్నారు. అయితే అవి ఎలాంటి సేవలను అంశంపై స్పందించలేదు.
Tags :