Radha Spaces ASBL

అయినా ఇది నిజమేనా? సాయి పల్లవి నటనకు గుడ్ బై చెప్పిందా?  

అయినా ఇది నిజమేనా? సాయి పల్లవి నటనకు గుడ్ బై చెప్పిందా?  

సాయి పల్లవి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. సహజసిద్ధమైన నటనతో, అద్భుతమైన నృత్యరీతులతో ప్రేక్షకులను కట్టిపడేసిన నటి సాయి పల్లవి. నేటి తరం హీరోయిన్ల మాదిరిగా గ్లామర్ షోలు, ఎక్స్‌పోజింగ్‌లకు పోకుండా.. నటనకు మాత్రమే ప్రాధాన్యం ఉన్న పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న సహజ నటి. ‘ఫిదా’ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సాయి పల్లవి.. తొలి సినిమాతోనే పాపులారిటీ సంపాదించుకున్నారు. నటి గా సాయి పల్లవికి తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక స్టార్ హీరోకి ఉన్నంత ఇమేజ్ సాయి పల్లవి ఉందంటే అతిశయోక్తి కాదు. మిగిలిన హీరోయిన్ల మాదిరిగా ఆమె ఎక్స్‌పోజింగ్‌లు చేయదు. గ్లామర్ షోలు ఉండవు. కానీ, ఆమె నటనకు సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు.

సాయి పల్లవి ఏదైనా ఈవెంట్‌కు వెళ్లినప్పుడు అర్థమవుతుంది ఆమెకు అభిమానులు ఏ స్థాయిలో ఉన్నారో. మరి అలాంటి నటి నటనకు దూరమైతే ఫ్యాన్స్ తట్టుకోగలరా..?   ఆమె చేసిన సినిమాలు తక్కువే అయినా ఇమేజ్ మాత్రం స్టార్ హీరో రేంజ్. కిందటేడాది ‘లవ్ స్టోరీ’, ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాలతో హిట్లు అందుకోవడమే కాకుండా తన నటనకు మరోసారి మంచి మార్కులు వేయించుకున్నారు సాయి పల్లవి. ఈ ఏడాది రానా దగ్గుబాటితో కలిసి నటించిన ‘విరాట పర్వం’ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సాయి పల్లవి నటన అందరినీ కట్టిపడేసింది. అయితే, ఈ సినిమా మాత్రం కమర్షియల్ హిట్ కాలేకపోయింది. ఆ తరవాత సాయి పల్లవి ప్రధాన పాత్రలో వచ్చిన లేడీ-ఓరియెంటెడ్ మూవీ ‘గార్గి’ సైతం ఆకట్టుకోలేకపోయింది. ఈ రెండు సినిమాల తరవాత సాయి పల్లవి మరో సినిమాను ఇప్పటి వరకు సైన్ చేయలేదు. ఇక మీదట చేయదట కూడా. ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్లను సైతం రిజెక్ట్ చేసిన ఈ లేడీ సూపర్ స్టార్‌కు సంబంధించి ప్రస్తుతం సినీ వర్గాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. సాయి పల్లవి తన యాక్టింగ్ కెరీర్‌కు ఫుల్‌స్టాప్ పెట్టేశారట. దీనికి బలమైన కారణమే ఉందంటున్నారు.

సాయి పల్లవి జార్జియాలో ఎంబీబీఎస్ పూర్తిచేసిన సంగతి తెలిసిందే. తాను డాక్టర్‌ అయ్యి పేదలకు సేవ చేయాలన్నది ఆమె కోరికట. కానీ, సినిమాల్లో బిజీ అయ్యి తన ప్రొఫెషన్‌ను పల్లవి పక్కన పెట్టేశారు. కానీ, ఇప్పుడు తన వృత్తికి న్యాయం చేయాలని అనుకుంటున్నారట సాయి పల్లవి. తన సొంతూరు కోయంబత్తూరులో సొంతంగా ఒక హాస్పిటల్ నిర్మించాలని సాయి పల్లవి నిర్ణయించుకున్నారట. తన చెల్లెలు పూజతో కలిసి ఒక హాస్పిటల్ నిర్మించి పేద ప్రజలకు వైద్య సేవలు అందించాలని సాయి పల్లవి డిసైడ్ అయ్యారని సమాచారం. ఈ నిర్ణయమే ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పాలనే ఆలోచనకు కారణం కావచ్చని అంటున్నారు. మరి ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలంటే సాయి పల్లవి స్పందించే వరకు ఆగాల్సిందే.  వార్త నిజమ్ కాకూడదు

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :