ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే ... ఓఆర్ఆర్ టోల్ స్కామ్ వెయ్యిరెట్లు
రూ.లక్ష కోట్ల విలువైన ఔటర్ రింగ్రోడ్డును రూ.7వేల కోట్లకు తెగనమ్మారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. గాంధీభవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే ఓఆర్ఆర్ టోల్ స్కామ్ వెయ్యి రెట్లు పెద్దదని విమర్శించారు. ఓఆర్ఆర్ టోల్ స్కామ్పై కేంద్రం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఎందుకు విచారణ జరిపించట్లేదని నిలదీశారు. 30 రోజుల నిబంధనపై అర్వింద్ కుమార్ ఏం చెబుతునారని ప్రశ్నించారు. ఒకవేళ నిబంధనలు ఏమైనా మార్చారా ఆ సమాచారం ఏది? 30 రోజుల్లో 25 శాతం చెల్లించాలని ఒప్పందంలో ఉంది. ఇప్పటికీ ఐఆర్బీ ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. నా ఆరోపణలపై బీఆర్ఎస్, బీజేపీ నేతలు వివరణ ఇవ్వాలని అని ఆరోపించారు.
Tags :