మరోసారి తెలుగు రాష్ట్రాలకు దక్కని అవకాశం
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల శకటాలకు మరోసారి అనుమతి దక్కలేదు. రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతి ఏడాది ఆయా రాష్ట్రాలకు సంబంధించిన శకటాలను ఢిల్లీలో ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కేవలం 12 రాష్ట్రాలు, 9 శాఖల శకటాలకు మాత్రమే అనుమతి లభించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు నిరాశే మిగిలింది. అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, గోవా, చత్తీస్గఢ్, జమ్మూకశ్మీర్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర, మేఘాలయ, కర్ణాటక రాష్ట్రాల శకటాలకు అనుమతి లభించింది. విద్యా నైపుణ్యాభివృద్ధి, విమానయాన శాఖ, సమాచార తపాలా, హోంశాఖ, జలశక్తి, సాంస్కృతిక శాఖల శకటాలకు అనుమతి లభించింది.
Tags :