ముకేశ్ అంబానీకి అరుదైన గౌరవం
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీకి అరుదైన గౌరవం దక్కింది. పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ 28వ సెషన్కు (కాప్ 28) మార్గదర్శకత్వం వహించే అంతర్జాతీయ అడ్వైజరీ కమిటీలో సభ్యునిగా ఎంపికయ్యారు. ఆయనతో పాటు భారత్ నుంచి వాతావరణ మార్పుల ఉద్యమ నేత సునీత నారాయణ్ ఎంపికయ్యారు. ఈ ప్యానెల్లో 31 మంది అంతర్జాతీయ నిపుణులు ఉంటారు. వాతావరణ మార్పులపై 2023 ఐక్యరాజ్య సమితి సదస్సు దుబాయ్లో నవంబర్లో 30 నుంచి డిసెంబర్ 12 వరకు జరుగనుంది.
Tags :