ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

తిరుమలలో కన్నులపండువగా రథసప్తమి వేడుకలు

తిరుమలలో కన్నులపండువగా రథసప్తమి వేడుకలు

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో రథసప్తమి వేడుకలు వైభవంగా  జరిగాయి. స్వామివారు సూర్యప్రభ వాహనంపై తిరుమాడ వీధులలో భక్తులకు దర్శనమిచ్చారు. ఇవాళ స్వామివారు సప్తవాహనాలపై దర్శనమిచ్చారు. మలయప్పస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గ్యాలరీల్లో వాహన సేవలు తిలకించే భక్తులకు టీటీడీ అధికారులు షెడ్లను నిర్మించారు. షెడ్ల నిర్మాణంతో పాటు అన్నప్రసాదాలు, పాలు, నీరు పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.  వెండి రథంపై మాడవీధుల్లో స్వామివారు ఊరేగింపు చేశారు. చంద్రప్రభ వాహనంతో వాహనసేవలు ముగిశాయి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :