Radha Spaces ASBL

తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్

తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్

తెలుగు రాష్ట్రాల్లో మరో కీలక ప్రాజెక్టుకు బీజం పడింది. కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి చొరవతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో రెండు సూపర్‌ఫాస్ట్‌ రైల్వే లైన్ల సర్వేకు బోర్డు అంగీకారం తెలిపింది. ఆరు నెలల్లోపు సర్వే పూర్తిచేయాలని నిర్ణయించింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వేకు బోర్డు లేఖ రాసింది. విశాఖపట్నం- విజయవాడ- శంషాబాద్‌, విశాఖపట్నం- విజయావాడ - కర్నూలు మార్గాల్లో ఈ సర్వే జరగనుంది. ఈ రెండు లైన్ల పరిధిలో మొత్తం 942 కి.మీ మార్గంలో  రైల్వే లైన్‌ నిర్మాణానికి అవసరమైన సర్వే నిర్వహించనున్నారు. ఈ సర్వేను ఆరు నెలల్లో పూర్తి చేయనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రైల్వే అనుసంధానాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడనుంది. ఆయా మార్గాల్లో సూపర్‌ఫాస్ట్‌ రైల్వే ప్రాజెక్టు చేపట్టేందుకు అవసరమైన టెక్నికల్‌ ఫీజిబిలిటీని ఈ సర్వే ద్వారా నిర్ణయిస్తారు. సర్వే తర్వాత ప్రాజెక్టుపై అడుగులు ముందుకు సాగనున్నాయి. ఈ రైల్వే లైన్ల అంశాన్ని కిషన్‌ రెడ్డి పలుమార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. రైల్వేశాఖ మంత్రి అశ్విన్‌ వైష్టవ్‌ను కలిసి లేఖలు అందజేశారు. ఈ రైల్వే లైన్ల ద్వారా తెలుగు రాష్ట్రాలకు చేకూరే లబ్ధిని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :