ఏడాది ముందుగానే పూర్తి చేయాలి : నారాయణ రెడ్డి
పోలవరం ప్రాజెక్టును 2025 జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణ రెడ్డి తెలిపారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ నేతృత్వంలో పోలవరం ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు. పోలవరం పనుల పురోగతి, సహాయ, పునరావాస కార్యక్రమాల అమలుపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా నారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఏడాది ముందుగానే నిర్మాణం పూర్తి చేయాలని ప్రయత్నిస్తున్నామని తెలిపారు. అడహక్ నిధుల కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.17,414 కోట్లు కేంద్రాన్ని అడిగిందని తెలిపారు. దీనిపై కేంద్రం పరిశీలిస్తామని చెప్పిందన్నారు. 41.15 మీటర్ల ఎత్తు వరకు ఆర్ఆండ్ఆర్ నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరగా, సానుకూలంగా స్పందించిందని వెల్లడించారు.
Tags :