ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

నేటి నుంచి ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు

నేటి నుంచి ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు

ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు (వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం) ఈనెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఆన్‌లైన్‌ మాధ్యమం ద్వారా జరగనున్న ఈ సదస్సు మొదటి రోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌లు ప్రసంగించనున్నారు. కరోనా మహహ్మారి కారణంగా ఆర్థిక వేదిక సదస్సు వార్షిక సమావేశాలు వాయిదపడిన విషయం తెలిసిందే. అయితే ఆన్‌లైన్‌ వేదికగా దావోస్‌ అజెండాతో 5 రోజులపాటు ఈ సదస్సును ఈ నెల 17 నుంచి నిర్వహించనున్నారు. జిన్‌పింగ్‌ ప్రత్యేక ప్రసంగంతో సదస్సు ప్రారంభం అవుతుంది. అనంతరం వర్చువల్‌ విధానంలో మోదీ ప్రసంగిస్తారు. అదేవిధంగా ప్రపంచంలోని వివిధ దేశాల అగ్రనేతలు ఇందులో భాగస్వామ్యం కానున్నారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :