నేటి నుంచి ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు
ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు (వరల్డ్ ఎకనామిక్ ఫోరం) ఈనెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఆన్లైన్ మాధ్యమం ద్వారా జరగనున్న ఈ సదస్సు మొదటి రోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్లు ప్రసంగించనున్నారు. కరోనా మహహ్మారి కారణంగా ఆర్థిక వేదిక సదస్సు వార్షిక సమావేశాలు వాయిదపడిన విషయం తెలిసిందే. అయితే ఆన్లైన్ వేదికగా దావోస్ అజెండాతో 5 రోజులపాటు ఈ సదస్సును ఈ నెల 17 నుంచి నిర్వహించనున్నారు. జిన్పింగ్ ప్రత్యేక ప్రసంగంతో సదస్సు ప్రారంభం అవుతుంది. అనంతరం వర్చువల్ విధానంలో మోదీ ప్రసంగిస్తారు. అదేవిధంగా ప్రపంచంలోని వివిధ దేశాల అగ్రనేతలు ఇందులో భాగస్వామ్యం కానున్నారు.
Tags :