కంబోడియా రాజుతో ప్రధాని మోదీ భేటీ
భారత్లో పర్యటిస్తున్న కంబోడియా రాజు నరోదమ్ శిహమోనితో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు అనేక అంశాలపై చర్చలు జరిపారు. రాష్ట్రపతి భవన్లో ఈ సమావేశం జరిగింది. కంబోడియాతో ద్వైపాక్షిక బంధాన్ని బలోపేతం చేసుకోవాలని భారత్ గట్టిగా భావిస్తున్నట్లు మోదీ తెలిపారు. రెండు దేశాల మధ్య సాంస్కృతిక బంధం ఉందని ఇద్దరు నేతలు అభిప్రాయపడ్డారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ కూడా శిహమోనితో భేటీ అయ్యారు. రక్షణ, పార్లమెంటరీ వ్యవహారాల్లో ఇరు దేశాల మధ్య సహకరించుకునే అంశంపై చర్చించారు.
Tags :