అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రసంగించనున్న మోదీ
అమెరికా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 22న అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రసంగించనున్నారు. భారత్ భవిష్యత్తుకు సంబంధించి తన దృక్పథం, ప్రస్తుతం రెండు దేశాలు ఎదుర్కొంటున్న ప్రపంచ సవాళ్లు వంటి అంశాలను ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించే అకాశముంది. ఈ మేరకు అమెరికా కాంగ్రెస్ చెందిన పలువురు అగ్రనేతలు ఓ ప్రకటన విడుదల చేశారు. మోదీ గౌరవార్థం అగ్రరాజ్య అధినేత జో బైడెన్ 22వ తేదీన విందు ఇవ్వనున్నారు. అమెరికా ప్రతినిధుల సభ, సెనేట్ల ద్వైపాక్షిక నాయకత్వం తరపున ఈ నెల 22న కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రసంగించేందుకు మిమ్మల్ని ఆహ్వానించడాన్ని గౌరవంగా భావిస్తున్నాం అని అమెరికా కాంగ్రెస్ అగ్రనేతలు పేర్కొన్నారు. అమెరికా కాంగ్రెస్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగించడం ఇది రెండోసారి.
Tags :