ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన షెడ్యూల్ ఇదే
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ సిద్ధమైంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని నరేంద్ర మోదీ సమావేశాలకు హాజరవుతున్నారు. ప్రధాని మోదీ 2వ తేదీ (శనివారం) మధ్యాహ్నం 12:45 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ లో బయలుదేరి 2:55 గంటల సమయంలో హైదారాబాద్లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి 3:20 గంటలకు హైటెక్స్లోని నోవాటెల్లోని హోటల్కు చేరుకుంటారు. 3:30 గంటలకు హెచ్ఐసీసీ వెళ్తారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 వరకు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో మోదీ పాల్గొంటారు. రాత్రి 9 గంటల నుంచి మిగతా సమయమంతా రిజర్వ్గా ఉంచారు.
3వ తేదీ (ఆదివారం) ఉదయం 10 నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు కార్యవర్గ భేటీలో పాల్గొంటారు. సాయంత్రం 4:30 నుంచి 5:40 వరకు రిజర్వ్గా ఉంచారు. సాయంత్రం 5:55 గంటలకు హైటెక్స్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 6:15 గంటలకు బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. ఎయిర్పోర్టు నుంచి రోడ్డు మార్గంలో పరేడ్ గ్రౌండ్స్కు వెళారు. సాయంత్రం 6:30 గంటల నుంచి 7:30 గంటలకు వరకు సభలో పాల్గొంటారు. రాత్రి 7:35 గంటలకు సభాస్థలి నుంచి బయలుదేరి, రాజ్భవన్కు గానీ, హోటల్కు గానీ చేరుకుని బస చేస్తారు. 4వ తేదీ (సోమవారం) ఉదయం 9:20 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని ప్రత్యేక విమానంలో ఆంధ్రప్రదేశ్కు బయలుదేరుతారు. ఉదయం 10:10 గంటలకు విజయవాడ చేరుకుని ఆంధ్రప్రదేశ్లోని కార్యక్రమాల్లో పాల్గొంటారు.