మంత్రి పెద్దిరెడ్డికి సీఎం వైఎస్ జగన్ అభినందనలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, సెర్ప్ సీఈవో ఇంతియాజ్ అహ్మద్ సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా పథకాల ద్వారా పేదల సుస్థిరాభివృద్ధి కోసం సెర్ప్ (గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ) చేపడుతున్న కార్యక్రమాలను ప్రశంసిస్తూ స్కోచ్ అందించిన గోల్డ్ అవార్డులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు చూపించారు. ఈ మేరకు గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్శాఖ ముఖ్య కార్యదర్శి, సెర్ప్ సీఈవోలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభినందించారు.
Tags :