Radha Spaces ASBL

ఘనంగా ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పైడి జయరాజ్ 113వ జయంతి వేడుకలు

ఘనంగా ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పైడి జయరాజ్ 113వ జయంతి వేడుకలు

అప్పట్లో అందరు సినిమాల్లో రాణించాలని మద్రాసు వెళితే మన జైరాజ్ మాత్రం ముంబై రైలు ఎక్కి ముంబై చేరుకొని అక్కడ సినిమాల్లో ప్రయత్నాలు సాగించారు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి హీరోగా ఎదిగి బాలీవుడ్ లో మొదటి తరం హీరోల్లో ఒకరిగా స్టార్ ఇమేజ్ అందుకుని విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన మహా నటుడు పైడి జయ రాజ్. దేశంలోనే ప్రతిష్టాత్మకంగా ఇచ్చే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోవడం విశేషం. సెప్టెంబర్ 28న అయన 113వ జన్మదినం సందర్బంగా జయంతి వేడుకలు బుధవారం ఫిలిం ఛాంబర్ లో ప్రముఖ నటుడు పంజాల జైహింద్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ వేడుకలకు సబాధ్యక్షులు గా పంజాల శ్రావణ్  గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా  జరిగాయి.. ఈ కార్యక్రమంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా నిర్మాత శ్రావణ్ గౌడ్ తో పాటు కెమెరామెన్ కంకణాల శ్రీనివాస్ రెడ్డి, పన్యాల మమత గౌడ్, ఆర్టిస్ట్ కవిత, కరాటే కళ్యాణ్, మొహన్ వడ్ల పట్ల, సీనియర్ ఆర్టిస్ట్ మాణిక్, నిర్మాత మోహన్ గౌడ్, ఆర్టిస్ట్ నరసింహ రెడ్డి, వంగరామన్న గౌడ్,నటుడు రోషన్  బాలు, తదితరులు పైడి జయ రాజ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ..

నిర్మాత శ్రావణ్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంతం నుండి మూకీల సమయంలోనే హీరోగా బాలీవుడ్ లో నిలదొక్కుకున్న తెలంగాణ నటుడు పైడి జయ రాజ్.ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి హీరోగా ఎదిగి ఆ తరువాత దేశంలోనే ప్రతిష్టాత్మకంగా ఇచ్చే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోవడం తెలంగాణ వారీగా, ముక్యంగా తెలుగు వారీగా ఇది మనకు నిజంగా గర్వకారణం. అయన జీవితం నేటితరాలకు స్ఫూర్తి. రియల్ హీరోగా ఎదిగిన అయన మనందరికీ ఆదర్శం. కొన్ని వందల సినిమాలు చేసిన పైడి జయరాజ్ ను ఒక్క సినిమా చేసిన వంజాల జైహింద్ గౌడ్ గారు ఇలాంటి గొప్ప మహనీయుని చరిత్ర  ప్రజలకు తెలియజేస్తూ గత 14 సంవత్సరాలుగా అయన జయంతి వేడుకలను మన నటుడు జైహింద్ గౌడ్ గారు సొంత ఖర్చులతో ఘనంగా జరుపుకుంటూ వస్తున్నారు. అయితే ఈ రోజు అయన 113 వ జన్మదిన వేడుకలలో మేము జరుపు కుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఫిలిం ఛాంబర్ పరిధిలో అయన విగ్రహం ఏర్పాటు చేయాలని ఛాంబర్ అధ్యక్షులకు తెలియజేయడం జరిగింది.అలాగే రాష్ట్ర గవర్నమెంట్ పైడి జయరాజ్ విగ్రహాన్ని  ట్యాంక్ బండ్ పై ప్రతిష్టించాలి. కరీంనగర్ కు పైడి జయరాజ్ గారి పేరు ప్రకటించాలి, నంది అవార్డ్స్ ఎలా ఉన్నాయో పైడి జయరాజ్ పేరుతో అవార్డ్స్ ప్రకటించాలని డిమాండ్ చెస్తున్నాము. నిజానికి అది ఎప్పుడో ఏర్పాటు చేయాల్సింది. కానీ చేయలేదు. ఇప్పటికైనా ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేయాలని అన్నారు.

సర్దార్ పాపన్న హీరో వంజాల జైహింద్ గౌడ్ మాట్లాడుతూ … తెలంగాణకు చెందిన పైడి జైరాజ్ గారు గొప్ప నటుడు. అయన 1980 లోనే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న గొప్ప వ్యక్తి పైడి జైరాజ్ గారు. అప్పట్లోనే అంటే మూకీల సమయంలోనే హీరోగా ఎదిగిన వ్యక్తి. అయన జీవితం మనందరికీ ఆదర్శం. అలాంటి మహనీయుడిని మనం మరచి పోకూడదు. అలాంటి వ్యక్తి గురించి తెలుగు పరిశ్రమ మరచిపోయిందని తెలిసి నేను గత 14 సంవత్సరాల నుండి నా సొంత  ఖర్చులతో అయన అయన చరిత్రను తెలుపుతూ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నాను. యావత్ తెలంగాణ ప్రజనీకానికి  తెలియ జేస్తున్నాను. కరీంనగర్ కు పైడి జయరాజ్ గారి పేరు ప్రకటించాలి, పైడి జయరాజ్ పేరుతో అవార్డ్స్ ప్రకటించాలి. రాష్ట్ర గవర్నమెంట్ పైడి జయరాజ్ జయంతిని  అధికారికంగా జీవో విడుదల చేస్తూ  ఇంకా గ్రాండ్ గా నిర్వహించాల్సిన అవసరం ఉంది.

ఫిలిం ఛాంబర్ ఆవరణలో పైడి జైరాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పడంతో ఛాంబర్ అధ్యక్షులు ప్రస్తుతం ఉన్న ఫిలిం ఛాంబర్ ను కూలగొట్టి పది అంతస్తుల భవనం నిర్మిస్తున్నాము. అప్పుడు పెట్టే విగ్రహాలతో పాటు పైడి జయరాజ్ విగ్రహం కూడా ప్రతిష్టిస్తాము అన్నారు. నేను సర్దార్ పాపన్న సినిమా తీసింది ఒక్క సినిమా అయినా తెలంగాణ కళాకారున్ని అవకాశాలు ఇవ్వాలని పోరాటాలు చేశాము. మొగలయ్య గారు సర్దార్ పాపన్న బుక్ రాయడం జరిగింది. తొందరలో మేము పైడి జయరాజ్ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది.ఆ ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది కళాకారులకు కానీ పేద కళాకారులకు చేయూత నిస్థామని తెలియజేస్తున్నాము. ప్రస్తుతం నేను నాలుగు సినిమాలు చేస్తున్నాను. ఇందులోని రేణుక ఎల్లమ్మ తల్లి మీద ఒక సినిమా చేస్తున్నాము. మరో చిత్రం వీర బైరాన్ పల్లి చిత్రాలు షూటింగ్ మొదలవుతాయి. వీటికి కెమెరామాన్  డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఉంటారు. ఈ సినిమాలకు వంజాల జైహింద్ గౌడ్ హీరోగా, మమతా గౌడ్ హీరోయిన్ గా ఉంటారు.అలాగే దయ్యాలున్నాయా సినిమాలో హీరోగా నటించిన సినిమా  విడుదలకు సిద్ధంగా ఉంది అన్నారు.

దర్శకుడు, కెమెరామెన్ కంకనాల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ… పైడి జయ రాజ్ లాంటి గొప్ప నటుడిని మరిచిపోకుండా జైహింద్ గౌడ్ గారు ప్రతి ఏటా ఆయన జయంతి వేడుకలు చేయడం నిజంగా గొప్ప విషయం అన్నారు. ఆర్టిస్ట్ కవిత  మాట్లాడుతూ.. పెద్దల హిస్టరీ ని నెమరువేసుకోవడం  చాలా సంతోషంగా ఉంది. రాజనాల, సావిత్రి, పైడి జయరాజ్ వంటి ఇలా పాత తరం  యాక్టర్స్ ను స్మరించుకోవడం పూర్వ జన్మ సుకృతం. బాలీవుడ్ లో మొదటి తరం హీరోల్లో ఒకరిగా స్టార్ ఇమేజ్ అందుకుని విలక్షణమైన పాత్రలలో నటించి మెప్పించిన మహా నటుడు పైడి జయ రాజ్ గారు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోవడం విశేషం. ఈ రోజు అయన 113వ జన్మదిన  జయంతి వేడుకలలో నేను పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది అన్నారు.

నటి కరాటే కళ్యాణ్ మాట్లాడుతూ.. కరీంనగర్ నుండి బాలీవుడ్ కు వెళ్లి అక్కడ హీరోగా రాణించి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు తీసుకున్నారనే విషయం మనందరికి తెలియకపోవడం చాలా బాధాకరం.. ఇలాంటి మహానుభావుల  సినిమాల గురించి తెలుసుకోవాలని కోరుతూ.. మనందరం గర్వించదగ్గ నటుడు  పైడి జయరాజ్ గారి 113వ జయంతి వేడుకలలో నేను పాలుపంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో పన్యాల మమత గౌడ్, మోహన్ వడ్ల పట్ల, సీనియర్ ఆర్టిస్ట్ మాణిక్ , నిర్మాత మోహన్ గౌడ్, ఆర్టిస్ట్ నరసింహ రెడ్డి, వంగరామన్న గౌడ్,నటుడు రోషన్ బాలుతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొని వారి సందేశాలు అందచేశారు.

పైడి జైరాజ్ గురించి .. క్లుప్తంగా ..

పైడి జైరాజ్ సెప్టెంబరు 28, 1909 న జన్మించారు. భారత చలనచిత్ర రంగంలో తనదైన ముద్ర వేసుకున్నారు. తెలంగాణ ప్రాంతం కరీంనగర్ కు చెందిన తెలుగు నటుడు, నిర్మాత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. పైడి జైరాజ్ 156 కు పైగా చిత్రాలలో కథానాయకుడి పాత్రలతోపాటు మొత్తం 300 పైగా మూకీ, టాకీ సినిమాలలో నటించారు. కరీంనగర్ జిల్లాకు చెందిన జైరాజ్ హైదరాబాద్ నిజాం కాలేజీలో చదివి సినిమాలపై ఆసక్తితో 1929లో ముంబాయి చేరుకున్నారు. తన ఇరవైయ్యో యేట 1930 లో తొలిసారిగా ” స్పార్క్లింగ్ యూత్ ” అనే మూకీ చిత్రంలో నటించారు. అదే సంవత్సరంలో ” ట్రయంఫ్ ఆఫ్ లవ్ ” అనే చిత్రంలో కథానాయకునిగా నటించారు. జైరాజ్ మొత్తం 11 మూకీ చిత్రాల్లో నటించారు.

1931 లో ప్రారంభమైన టాకీ యుగంలో ఆయన ”షికారి” ఉర్దూ చిత్రంతో టాకీల్లో ప్రవేశించారు. తర్వాత కాలంలో శాంతారాం, పృధ్వీరాజ్ కపూర్ లాంటి పెద్ద హీరోల సరసన మరో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. నిరూపా రాయ్, శశికళ, దేవికారాణి, మీనాకుమారి లాంటి హీరోయిన్ లతో నటించారు. సుమారు 156 ‘టాకీ’ సినిమాలలో కథానాయకుడిగా, విలక్షణమైన నటుడిగా పలు వైవిధ్యమైన పాత్రలు పోషించారు. హిందీ, ఉర్దూ భాషలతో పాటు, కొన్ని మరాఠీ, గుజరాతీ భాషా చిత్రాలలో కూడా నటించారు. జైరాజ్ పోషించిన టిప్పు సుల్తాన్, పృథ్వీరాజ్ చౌహాన్, రాణా ప్రతాప్ మొదలైన చారిత్రక సంబంధ పాత్రలు విశిష్టమైనవి. సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమా 1962, ఫిబ్రవరి 24న విడుదలైంది. సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్ అనే హిందీ సినిమా తెలుగులోకి అనువాదం చేయబడింది.

నటుడిగానే కాక మొహర్, మాలా, ప్రతిమ, సాగర్ లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇందులో ‘ సాగర్ ‘ చిత్రానికి నిర్మాత కూడా ఆయనే. పైడి జైరాజ్ తెలుగు వాడైనప్పటికీ కూడా ఒక్క తెలుగు చిత్రంలోనూ నటించలేకపోయారు. జైరాజ్ భారతీయ సినిమా వికాసానికి తన జీవితకాలంలో చేసిన సేవలకు గుర్తింపుగా ప్రతిష్ఠాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును 1980లో కేంద్ర ప్రభుత్వం ప్రధానం చేసి గౌరవించింది. పైడి జయరాజ్ కు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుర్లు. అయన 2000 సంవత్సరం ఆగష్టు 11న పరమపదించారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :