Radha Spaces ASBL

బే ఏరియా లో ఘనంగా జరిగిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు

బే ఏరియా లో ఘనంగా జరిగిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు

కాలిఫోర్నియాలో ఉన్న మిల్పిటాస్‌లోని ఇండియా కమ్యూనిటీ సెంటర్ లో శుక్రవారం 19 మే 2023న అత్యంత ఘనంగా ఎన్ టీ ఆర్ శత జయంతి వేడుకలు జరిగాయి. ముఖ్య అతిధిగా శాన్‌ఫ్రాన్సిస్కో కాన్సల్ జనరల్ ఆఫ్ ఇండియా నాగేంద్ర ప్రసాద్ హాజరయ్యారు. అతిథులు జస్టిస్ వేణు గోపాల్, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జి, ఎన్నారై టీడిపి నాయకులు జయరామ్ కోమటి, వెంకట్ కోగంటి తదితరులు జ్యోతి ప్రజ్వలన చేశారు.

మిల్ పిటాస్ నగర డిప్యూటీ మేయర్ Ms Evelyn Chua మాట్లాడుతూ మే 28వ తేదీని మిల్‌పిటాస్‌లో ఎన్ టీ ఆర్ తేదీ గా గుర్తిస్తూ proclamation చేశామని అంటూ, ఎన్ టి ఆర్ సేవలను కొనియాడారు. ఈ సర్టిఫికెట్‌ను ఆయన జయరామ్ కోమటి, వెంకట్ కోగంటికి అందించారు.

కాన్సల్ జనరల్ నాగేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఆత్మ గౌరవం, ఆత్మాభిమానం అనే మాటలను అందరికీ తెలిసేలా చేసిన వ్యక్తి శ్రీ ఎన్ టి ఆర్ అని, ఆయన వ్యక్తి గా అందరికీ చిరస్మరణీయుడు అని, అలాగే ఒక ముఖ్యమంత్రి గా ఆయన అందరికీ గుర్తుండి పోయే పనులు చేశారని అన్నారు.

ప్రత్యేక అతిధి జస్టిస్ వేణు గోపాల్ మాట్లాడుతూ ఎన్ టి ఆర్ రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ గుర్తుంచు కొనే వ్యక్తి అని, ఆయన ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ఈ రోజు వరకు వున్నాయని తెలిపారు.

జయరామ్ కోమటి మాట్లాడుతూ ఎన్ టి ఆర్ శత జయంతి వేడుకలు గత సంవత్సరం మే 28 నుంచి అమెరికా లో 12 నగరాలలో పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. మే నెలలో 20, 21, 27, 28 తేదీలలో ప్రపంచ వ్యాప్తంగా 100 నగరాలలో పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి. బహుశా ప్రపంచ చరిత్ర లో ఇది మొదటి సారి అని చెప్పుకోవచ్చు అని అన్నారు.

పార్లమెంట్ సభ్యుడు కింజారపు రామూర్తి నాయుడు డల్లాస్ నుంచి జూమ్ ద్వారా  మాట్లాడారు. తెలుగు రాష్ట్రాలలో ఎన్ టి ఆర్ ఫోటో లను దేముడి ఫోటోలు గా పెట్టుకొన్నారు. అలాంటి ప్రజలకు ఏ ప్రాబ్లెమ్ వచ్చినా సినిమా ఇండస్ట్రీ నుంచి ముందుకు వచ్చి సహాయం చేసే ప్రక్రియ తీసుకొచ్చిన వ్యక్తి ఎన్ టీ ఆర్. అని, తెలుగు దేశం పార్టీ ని స్థాపించి కింది తరగతి నుంచి కూడా అనేక నాయకులను తయారు చేసిన నాయకుడు, పేదలకు కావలసిన అనేక సంక్షేమ పథకాలు మొదలు పెట్టిన వ్యక్తి, మహిళలు కూడా సమాజం లో ఒక భాగం అని చెప్పిన వ్యక్తి అని తెలియజేశారు. ఎన్ టి ఆర్ గొప్పతనం గురించి ముందు తరం వాళ్ల కు తెలిసేలా ఇప్పటి తరం వారు పని చేయాలని అన్నారు.

సమావేశానికి ముందుగా శ్రీ ప్రసాద్ మంగిన ఆధ్వర్యంలో జరిగిన సంగీత విభావరిలో గాయని గాయకులు ఎన్ టి ఆర్ సినిమాలలోని పాటలు పాడి అందరినీ అలరించారు. పాఠశాల విద్యార్థి కార్తిక్ దాన వీర శూర కర్ణ లోని దుర్యోధన పాత్ర లో నటించి అందరి చేత చప్పట్లు కొట్టించుకొన్నాడు. వేణు ఆసూరీ ఎన్ టి ఆర్ చిత్రాలలో వున్న వైవిధ్యం గురించి వివరించారు. వెంకట్ కోగంటి,  కళ్యాణ్ వీరపనేని, గోకుల్ రసి రాజు, వెంకట్ అడుసుమిల్లి, భక్తా భల్ల తదితరులు కూడా మాట్లాడారు.

ఈ కార్యక్రమాన్ని శ్రీమతి విజయ ఆసూరి నిర్వహించారు. వచ్చిన అతిథులు, మహిళలు, పిల్లల సమక్షంలో పుట్టిన రోజు కేక్ కట్ చేసి సమావేశాన్ని ముగించారు.

స్వాగత్, మిస్టర్ బిర్యానీ, భీమవరం రుచులు స్పాన్సర్స్‌గా వ్యవహరించి, శ్రీకాంత్ దొడ్డపనేని ఆధ్వర్యంలో పసందైన విందు భోజనం ఏర్పాటు చేశారు. వెంకట్ అడుసుమిల్లి, వెంకట్ కోగంటి, సయ్యద్ అహ్మద్, నరేన్ కొడాలి ప్యానల్ మరియు అనేకమంది స్పాన్సర్స్ గా ఈ కార్యక్రమానికి సపోర్ట్ గా నిలిచారు.

 

Click here for Event Gallery

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :