ఆస్ట్రేలియాలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు
ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఎన్టీఆర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా సినీనటుడు బాలకృష్ణ సతిమణి వసుంధర, కుమార్తె తేజస్విని, టీడీపీ కార్యదర్శి నర్సిరెడ్డి హాజరయ్యారు. వారికి ఎన్టీఆర్ అభిమాన సంఘం పేరుతో ముద్రించిన టీషర్ను అందిస్తూ నిర్వాహకులు స్వాగతం పలికారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసిన అనంతరం వినుకొండకు చెందిన డీఎల్డీఏ చైర్మన్ లగడపాటి వెంకట్రావు సతీమణి వెంకాయమ్మ స్మారకార్థం వారి కుమారుడు సుబ్బారావు 5300డాలర్లను ఎన్టీఆర్ ట్రస్టుకు విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐలు జి.మల్లికార్జునరావు, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Tags :