తాడేపల్లిలో లోకేశ్ క్రీడామైదానం... ప్రారంభించిన జయరాం కోమటి
తాడేపల్లి పట్టణంలోని బైపాస్ రోడ్డు సమీపంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తన సొంత ఖర్చులతో నియోజకవర్గ ప్రజల కోసం క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేసి యువతలో జోష్ నింపుతున్నారు. ఈ క్రీడా మైదానాన్ని ఎన్నారైలు కోమటి జయరాం, వేమూరి రవికుమార్ నియోజకవర్గ నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడల వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలతోపాటు ఆరోగ్యవంతమైన జీవనం సాధ్యమవుతుందని భావించిన లోకేశ్ నియోజకవర్గంలో క్రీడా మైదానాలను ఏర్పాటు చేశారన్నారు. తాడేపల్లి క్రీడాకారుల అభిరుచికి తగ్గట్టుగా క్రీడా మైదానంలో షటిల్ కోర్టులు 4, క్రికెట్ ప్రాక్టీస్ నెట్స్ 2, వాలీబాల్ కోర్టు 1, వాకింగ్ ట్రాక్ ను ఆహ్లాదకమైన వాతావరణంలో అందరికీ అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. నారా లోకేశ్ క్రీడాకారుల కోసం టోర్న్మెంట్స్ నిర్వహించడంతోపాటు వారికి అవసరమైన క్రికెట్ కిట్స్, వాలీబాల్ నెట్స్ ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు.