మోడ్రన్ లవ్ హైదరాబాద్ వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్
నడవలేని స్థితిలో నిత్యా మీనన్ బౌన్సర్స్ సహాయంతో స్టేజి పైకి
మోడ్రన్ లవ్ హైదరాబాద్ వెబ్ సిరీస్ ట్రైలర్ను మేకర్స్ లాంచ్ చేశారు. ఈ ఈవెంట్కు నిత్యా మీనన్ చేతిలో స్టిక్ పట్టుకుని రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తనకు ఏం జరిగిందో ఆమె క్లారిటీ ఇచ్చింది. గతేడాది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన 'భీమ్లా నాయక్' మూవీలో అలరించిన నిత్యా మీనన్ .. 'మోడ్రన్ లవ్ హైదరాబాద్' వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ వెబ్ సిరీస్లో నిత్యా మీనన్తో పాటు రేవతి, నరేష్, ఆది పినిశెట్టి, రీతూ వర్మ, బిగ్బాస్ విన్నర్ అభిజిత్, మాళవిక నాయర్, సుహాసిని తదితరులు కీలక పాత్రలు పోషించారు. జులై 8వ తేదీ నుంచి ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ సిరీస్కు సంబంధించిన ట్రైలర్ను మేకర్స్ లాంచ్ చేశారు. అదేవిధంగా నటీనటులతో కాసేపు సరదాగా ముచ్చట్లు పెట్టారు. అయితే ఈ ఈవెంట్కు నిత్యా మీనన్ చేతిలో స్టిక్ పట్టుకుని రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆమె నడవలేని స్థితిలో ఇద్దరు బాడీ గార్డ్స్ సాయంతో వచ్చింది.
ఈ సందర్భంగా నిత్యా మీనన్ మాట్లాడుతూ.. 'ఈ వెబ్ సిరీస్లో నేను ఎల్బో క్రచ్తో నటించాను. అయితే నాకు నిజ జీవితంలోనూ ఇప్పుడు అదే జరిగింది. రెండు రోజుల క్రితం స్టెప్స్ నుంచి స్లిప్ పడిపోయాను. ఇప్పుడు ఎల్బో క్రచ్తో ఇబ్బంది పడుతున్నా. రేవతి గారిని చూస్తుంటే ఇంట్లో మనిషిలా ఉంటారు. మా అమ్మ కూడా రేవతి మేడంలా ఉంటారు..' అంటూ చెప్పుకొచ్చారు.ఇక మోడ్రన్ లవ్ హైదరాబాద్ ట్రైలర్ విషయానికి వస్తే.. మొత్తం ఆరు స్టోరీలను టచ్ చేస్తూ.. రూపొందించినట్లు అర్థమవుతోంది. 'భాష కనిపెట్టకముందే.. మాట్లాడటం రాకముందే మనుషులు ప్రేమించుకోవడం మొదలుపెట్టారు..' అనే డైలాగ్తో ట్రైలర్ను మొదలుపెట్టారు. 6 ఎపిసోడ్స్తో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.ఈ కార్యాక్రమం లో అమెజాన్ ప్రైమ్ ప్రతినిధి, ఆరు కథలకు దర్శకత్వం వహించిన దర్శకులు మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణి, సీనియర్ నరేష్, సుహాసిని, రీతూ వర్మ, తదితరులు పాల్గొన్నారు.