Radha Spaces ASBL

తిరుమల మాదిరిగానే శ్రీశైలం సన్నిదిలో కూడా

తిరుమల మాదిరిగానే శ్రీశైలం సన్నిదిలో కూడా

శ్రీశైలం మల్లికార్జున స్వామిని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. మల్లికార్జున స్వామి, భ్రమరాంభ అమ్మవారిని ఎన్నిసార్లు చూసినా తనివి తీరదన్నారు. కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు.  తిరుమల మాదిరిగానే శ్రీశైలం సన్నిధి కూడా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాని తెలిపారు. స్వామి వారి దయ వల్ల తెలంగాణ, ఆంద్రప్రదేశ్‌ రాష్ట్రాలతో పాటు ప్రజలందరూ బాగుండాలని ప్రార్థించాను. శ్రీశైలం ఆలయం ఎంతో అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :