జూన్ 8న శ్రీవారి ఆలయ సంప్రోక్షణ
జమ్మూకశ్మీర్లో జూన్ 8వ తేదీన శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయ సంప్రోక్షణ ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించింది. జూన్ 3న శ్రీవారి ఆలయంలో వైదిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయని తెలిపింది. జమ్మూ కశ్మీర్లో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని టీటీడీ నిర్మించిన విషయం తెలిసిందే. వైఖానస ఆగమోక్తంగా, సర్వాంగా సుందరంగా ఈ ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు. మాతా వైష్ణోదేవి ధర్మనం కోసం జమ్మూ వచ్చే భక్తులకు శ్రీవారి ఆలయ సందర్శనం ఎనలేని ఆధ్యాత్మిక అనుభూతిని ఇవ్వనుందని టీటీడీ అధికారులు తెలిపారు.
Tags :