55 ఏళ్లలో సాధ్యం కానిది.. ఈ 9 ఏళ్లలో : మంత్రి కేటీఆర్

రాబంధుల లెక్క రైతులను పీక్కతిన్నోళ్లు మనకు అవసరమా? అని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఆలేరు బీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీతకు మద్దతుగా యాదగిరిగుట్టలో మంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ డిసెంబర్ 3న గొంగిడి సునీత ఆలేరు ఎమ్మెల్యేగా మూడోసారి గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. 2014లో యాదగిరిగుట్ట ఎట్లుండే ఇప్పుడు ఎట్లుందో ఆలోచించి ప్రజలు ఓటు వేయాలని కోరారు. యావత్ ప్రపంచం చర్చించుకునే విధంగా సీఎం కేసీఆర్ యాదగిరిగుట్టను అభివృద్ధి చేశారు. కొండపైకి ఆటోలు వెళ్లేలా డ్రైవర్లకు డిసెంబర్ 3 తర్వాత శుభవార్త చెబుతాం. కాంగ్రెస్ ఇచ్చింది ఉచిత కరెంట్ కాదు, ఉత్తుత్తి కరెంట్ అన్నారు. వరిధాన్యం పండిరచడంలో ఉమ్మడి నల్గొండ జిల్లా నవంబర్ వన్ అన్నారు.
డిసెంబర్ 3 తర్వాత కొత్త రేషన్ కార్డులు, కొత్త పింఛన్లు వస్తాయి. అలాగే 4 కొత్త పథకాలు ప్రకటిస్తాం. 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డల కోసం సౌభాగ్యలక్ష్మీ, ఆసరా పెన్షన్లను రూ.5వేలు, వంటగ్యాస్ సిలిండర్ రూ.400కే ఇస్తాం. తెల్లరేషన్ కార్డుదారులకు సన్నబియ్యం ఇవ్వబోతున్నాం. భూమినేని పేదలకు రూ.5 లక్షల కేసీఆర్ బీమా కల్పిస్తాం. అసైన్డ్ భూములను రెగ్యులరైజ్ చేయడంతో పాటు సమ్మక్క సారక్క పేర్లపై మహిళా సంఘాలు ఏర్పాటు చేస్తాం. గొంగిడి సునీతను మళ్లీ గెలిపిస్తే మాదాపూర్, రఘునాథపురాలను మండలాలుగా ప్రకటిస్తాం. ఆలేరును రెవెన్యూ డివిజన్గా ప్రకటిస్తాం. యాదాద్రి కొండపైకి ఆటోలను అనుమతిస్తాం. దాతరుపల్లి వద్ద టూరిజం పార్కుతో పాటు పారిశ్రామిక కారిడార్ తీసువస్తాం అని అన్నారు.






