Radha Spaces ASBL

ప్రధాని మోదీ పర్యటన కోసం... తెలంగాణ ప్రజలు

ప్రధాని మోదీ పర్యటన కోసం...  తెలంగాణ ప్రజలు

తెలంగాణ ప్రజలందరూ ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన కోసం ఎదురుచూస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించే ప్రధాని మోదీ బహిరంగ సభ ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి సహా పలువురు బీజేపీ నేతలు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కిషన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కార్యకర్తలను, అభిమానులను సభకు తరలించేందుకు ప్రణాళిక సిద్దం చేసిందన్నారు. మూడు రోజులపాటు హైదరాబాద్‌ నగరంలో అత్యంత ఉత్సాహభరితమైన వాతావరణంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగబోతున్నాయని అన్నారు. బీజేపీ సమావేశాలు విజయవంతం కావాలని తెలంగాణ ప్రజలు ఆకాంక్షిస్తున్నారన్నారు.

తెలంగాణ రాష్ట్రానికి ఒకేసారి 18 మంది ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు, కేంద్ర మంత్రులు, ముఖ్య నేతలంతా రావడం అరుదైన దృశ్యం అన్నారు. ఈ కార్యక్రమాన్ని బీజేపీ ఒక పండుగ వాతావరణంలో నిర్వహించబోతోంది.  బీజేపీ కార్యక్రమాలకు టీఆర్‌స్‌ ప్రభుత్వం అనేక అవరోధాలు సృష్టిస్తోంది. బీజేపీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే సీఎం కేసీఆర్‌ పెద్ద ఎత్తున ప్రజాధనం ఉపయోగించి ఫ్లెక్సీలు, హోర్డింగ్స్‌ ఏర్పాటు చేశారు. ఇలా వారు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. కానీ మేము ప్రజల సహకారంతోనే ఈ సమావేశాలను విజయవంతం చేస్తాము. దేశాన్ని, రాష్ట్రాలను శక్తివంతంగా తీర్చిదిద్దుతామని అన్నారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :