బీఆర్ఎస్ తో నీతులు చెప్పించుకునే స్థితిలో బీజేపీ లేదు
బీఆర్ఎస్తో నీతులు చెప్పించుకునే పరిస్థితుల్లో బీజేపీ లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవంపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రతినిధులు రాకపోతే పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం ఆగిపోతుందా? అని ప్రశ్నించారు. కేంద్రం నిర్వహించే సమావేశాలకు కేసీఆర్ హాజరుకాకపోవటం బాధ్యతారాహిత్యమే అవుతుందని దుయ్యబట్టారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం ప్రారంభోత్సవానికి గవర్నర్ను ఎందుకు ఆహ్వానించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. రేపటి నీతిఅయోగ్ సమావేశానికి కూడా బీఆర్ఎస్ దూరంగా ఉండటం దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు.
కేసీఆర్ వైఖరి కారణంగా పోరాడి సాధించుకున్న తెలంగాణ నష్టపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి అధికారిక కార్యక్రమాలకు సీఎం రాకపోవడం సిగ్టుచేట్టన్నారు. కేసీఆర్కు మహారాష్ట్ర వెళ్లేందుకు తీరిక ఉంది కానీ అంబేడ్కర్, జగ్జీవర్ రామ్ జయంతికి పూలమాల వేయటానికి తీరికలేదని విమర్శించారు. కేంద్రంతో ఘర్షణాత్మకమైన వైఖరితో రాష్ట్రం నష్టపోతోందని అవకాశం ఉన్న చోట తెలంగాణ గొంతు వినిపించటంలో కేసీఆర్ విఫలమయ్యారని దుయ్యబట్టారు. ప్రభుత్వాల మధ్యలో ఘర్షణాత్మకమైన వైఖరి తెలంగాణకు నష్టం చేకూరుస్తోందన్నారు. జూన్ 3, 4 తేదీల్లో హైదరాబాద్లో జరిగే జాబ్ మేళకు భారీగా హాజరుకావాలని ఈ సందర్భంగా నిరుద్యోగులకు సూచించారు.