Radha Spaces ASBL

ఢిల్లీ లిక్కర్ స్కాం కొత్త చార్జిషీటులో లేని కవిత పేరు?. విచారణ వాయిదా!

ఢిల్లీ లిక్కర్ స్కాం కొత్త చార్జిషీటులో లేని కవిత పేరు?. విచారణ వాయిదా!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో విచారణను కోర్టు జూన్ 1కి వాయిదా వేసింది.  ఈ కేసులో ఈడీ దాఖలు చేసిన నాలుగో అనుబంధ చార్జిషీటును కూడా రౌస్ అవెన్యూ కోర్టు పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలిపింది. మే 4వ తేదీన లిక్కర్ స్కాం మనీలాండరింగ్ వ్యవహారంలో ఈడీ నాలుగో అనుబంధ చార్జిషీటును దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ అనుబంధ చార్జిషీటులో ప్రధానంగా ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాపై ఈడీ పలు అభియోగాలు మోపింది. ఈ స్కాంలో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు కూడా ఈ చార్జిషీటులో పలుమార్లు ప్రస్తావనకు రావడం గమనార్హం. కవిత విషయంలో గత చార్జిషీటులో పొందుపరిచిన అంశాలనే ఈడీ మరోమారు ఈ చార్జిషీట్‌లో ప్రస్తావించింది. దక్షిణాది వ్యక్తులకు, ఆప్ నేతలకు మధ్య ఒప్పందం ఉందని అభియోగాలు మోపింది.

ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో దక్షిణాది వ్యక్తులకు లబ్ది చేకూర్చేలా పాలసీ రూపకల్పన చేశారని, ఈ క్రమంలో పలు అక్రమాలకు పాల్పడ్డారని ఈడీ అభియోగాలు నమోదు చేసింది. లబ్ది చేకూర్చినందుకు దక్షిణాది వ్యక్తుల నుంచి ఆప్ నేతలకు భారీగా ముడుపులు అందాయని ఈడీ ఆరోపించింది. ఈ మేరకు 270 ముఖ్యమైన డాక్యుమెంట్లు, 2 వేల పేజీలతో కూడిన 4వ అదనపు చార్జిషీటును మే మొదటివారంలోనే ఈడీ దాఖలు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను ఈడీ ఇప్పటికే మూడుసార్లు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. తాము ఇప్పటివరకు ప్రశ్నించిన 51 మంది వివరాలను కూడా ఈడీ తమ చార్జిషీటులో యాడ్ చేసింది. అయితే, ఈడీ ప్రస్తావించిన 51 మందిలో కవిత పేరు లేనట్టు సమాచారం. ఈ మేరకు నాలుగో చార్జిషీటును పరిగణనలోకి తీసుకున్న రౌస్ అవెన్యూ కోర్టు తదుపరి విచారణను జూన్ 1కి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :