ఈ వ్యవహారాన్ని ప్రపంచమంతా చూస్తోంది
ఢిల్లీలో రెజ్లర్లు చేస్తున్న ఆందోళనకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ రెజ్లర్లను లైంగికంగా వేధించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్సింగ్పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై రెజ్లర్లు వివిధ రూపాల్లో నిరసన తెలుపుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిచి రెజ్లర్లు లేవనెత్తుతున్న అంశాలను పరిగణనలోకి తీసుకుని తగిన పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. దేశానికి బంగారు పతకాలు సాధించిన క్రీడాకారుల పట్ల అనుచితంగా వ్యవహరించడం తగదన్నారు. ఈ వ్యవహారాన్ని ప్రపంచమంతా చూస్తోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి దేశ ప్రజలు సమాధానం కోరుకుంటున్నారని అన్నారు.
Tags :