టీడీపీ నేత కన్నా లక్ష్మీ నారాయణ కీలక వ్యాఖ్యలు .. ఎవరితోను
పార్టీని బలోపేతం చేస్తూ వైసీపీ అరాచకాలు ప్రజలోకి తీసుకెళ్తామని తెలుగుదేశం పార్టీ నేత కన్నా లక్ష్మీ నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు జిల్లాలో వ్యక్తిగతంగా ఎవరితోను విబేధాలు లేవన్నారు. పార్టీ పరమైన విబేధాలు మాత్రమే ఉండేవన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గం ఇంఛార్జి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ, కష్టపడి పని చేస్తాను అదే నన్ను గెలిపిస్తుందని తెలిపారు. వైవీ ఆంజినేయులు, అబ్బూరు మల్లి, శౌరయ్య వంటి నేతలంతా కలిసి పని చేస్తామని తెలిపారు.
Tags :