భద్రతా మండలిని పునర్వ్యవస్థీకరించాల్సిందే : జైశంకర్
భద్రత మండలిని పునర్వ్యవస్థీకరించడం తేలికైన విషయం కాకపోయినప్పటికీ ఆ ప్రక్రియను నిరవధికంగా వాయిదావేస్తూ ఉండటం సరికాదని భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. అమెరికా పర్యటనను ముగించుకొని స్వదేశానికి బయలు దేరడానికి ముందు వాషింగ్టన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. సంస్కరణలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మద్దతిస్తారని భావిస్తున్నట్లు తెలిపారు. వాటికి అడ్డుపడుతున్నదెవరో అందరికీ తెలుసని చైనాను ఉద్దేశించి అన్నారు.
Tags :