Radha Spaces ASBL

మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు..

మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు..

విజయవాడలో వైసీపీ నిర్వహించనున్న బీసీ మహాసభకి సంబంధించిన పోస్టర్‌ ని నగరిలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి రోజా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ తన భర్త సెల్వమణి బీసీ సామాజికవర్గానికి చెందినవారని, తాను బీసీ ఇంటి కోడలినని తెలిపారు. విజయవాడలో నిర్వహించే బీసీ మహాసభను విజయవంతం చేయాలని కోరారు. బీసీలను టీడీపీ అధినేత చంద్రబాబు పట్టించుకోలేదని, కేవలం ఓటు బ్యాంకుగానే చూశారని ఆమె విమర్శించారు. ఓటు బ్యాంకుగా భావించే చంద్రబాబుకు ఈసారి ఎన్నికల్లో గట్టిగా బుద్ది చెప్పాలని తెలిపారు. బీసీలను వెనుకబడినవారిగా కాకుండా రాష్ట్రానికే వెన్నెముకగా గుర్తించిన ఏకైక ముఖ్యమంత్రి  జగన్‌ అని కొనియడారు. 130 బీసీ కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లను ఏర్పాటు  చేసిన ఘనత జగన్‌ దని అన్నారు.  నామినేటెడ్‌ పదవులు, నామినేషన్‌ పనుల్లోనూ బీసీలకు 50 శాతం రిజర్వేషన్లను కల్పించిన ఘనత జగనన్నకే దక్కుతుందని తెలిపారు. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :