Radha Spaces ASBL

వాషింగ్టన్‌ డీసీలో జిడబ్ల్యుటీసిఎస్ స్వాతంత్య్రదినోత్సవ వేడుకలు

వాషింగ్టన్‌ డీసీలో జిడబ్ల్యుటీసిఎస్ స్వాతంత్య్రదినోత్సవ వేడుకలు

భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జిడబ్ల్యుటీసిఎస్‌ ఆధ్వర్యంలో వాషింగ్టన్‌ డీసీలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలతో కార్యక్రమం ఉల్లాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జీడబ్ల్యూటీసీఎస్‌ అధ్యక్షురాలు సాయి సుధ పాలడుగు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, తానా పూర్వ అధ్యక్షులు సతీష్‌ వేమన, మిర్చి యార్డ్‌ మాజీ ఛైర్మన్‌ మన్నవ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. జాతీయ జెండాను ఎగురవేశారు. జెండాలను చేతబూని ప్రదర్శన నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. క్రీడల్లో విజేతలైన వారికి బహుమతులు అందజేశారు. భాను మాగులూరి వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో అన్షుల్‌ శర్మ కౌన్సెలర్‌ ఇండియన్‌ ఎంబసీ, సత్యనారాయణ మన్నె, చంద్ర మల్లావతు, కృష్ణ లాం, రవి అడుసుమల్లి, రాజేష్‌ కాసరనేని, ఫణి తాళ్లూరు, శ్రీనివాస్‌ గంగా, యాష్‌ బద్దులూరి, సుశాంత్‌ మన్నె, సుష్మ అమృతలూరు తదితరులు పాల్గొన్నారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :