వైఎస్ జగన్ అరాచకాలాకు .. రాష్ట్ర ప్రజలు సెలవు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అరాచకాలకు రాష్ట్ర ప్రజలు సెలవు చెప్పాలని చూస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మహానాడును విజయవంతం చేసినా టీడీపీ కార్యకర్తలు, అభిమానులకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఆతిథ్యం ఇవ్వడంలో తెలుగుదేశాన్ని మించింది లేదన్నారు. టీడీపీ తొలి విడత మేనిఫెస్టోని ప్రజలు ఆదరిస్తారని, దసరాకి పూర్తి స్థాయి మేనిఫెస్టో వస్తుందని తెలిపారు. మహానాడు బ్యానర్లు కట్టుకుంటే మధ్యలో ఎంపీ భరత్ దూరి వైసీపీ ప్లెక్సీలు కడుతున్నారు. తిరిగి మా మీదే కేసులు పెడుతున్నారు. రాజమహేంద్రవరంలో అధికారులతో కలిసి ఎంపీ ఆటలాడుకుంటున్నారు. సవాల్ విసురుతున్నా పోలీసులు చుట్టూ లేకుండా వైసీపీ నేతలు ఎవరైనా బయటకు రాగలరా? అని ప్రశ్నించారు. సీఎం జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా అవినాష్ కేసు విషయం బ్రేకులు పడుతూనే ఉందన్నారు. హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తారా? అని ఆయన నిలదీశారు. అవినాష్ రెడ్డి కేసు అంతులేని కథ అని అన్నారు.