గూగుల్ మాజీ సీఈవో వార్నింగ్
చాట్జీపీట్ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్కు విశేష ఆదరణ లభిస్తుండగా ఈ టూల్స్పై పరిశ్రమ దిగ్గజాలు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ఏఐ టూల్స్తో కొలువుల కోత తప్పదని పలువురు హెచ్చరిస్తుండగా ఉత్పాదకత మెరుగవుతుందని మరికొందరు సమర్థిస్తున్నారు. ఏమైనా ఏఐ రాకతో చాట్జీపీటీ వంటి టూల్స్పై టెక్ ప్రపంచంలో హాట్ డిబేట్ సాగుతోంది. గూగుల్ మాజీ సీఈవో ఎరిక్ ష్మిత్ కృత్రిమ మేధస్సు సాధనాల దుష్ప్రభావాలపై ప్రజలను హెచ్చరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక అస్తిత్వ ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఇది పలువురికి హాని తలపెట్టడమే కాదు పెద్దసంఖ్యలో ప్రజలను చంపేస్తుందని హెచ్చరించారు. ఎరిక్ ష్మిత్ మాట్లాడుతూ ఏఐ పర్యవసానాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇది మానవాళికి పెను ముప్పును కలిగిస్తుందని, పెద్ద సంఖ్యలో ప్రజలను హాని తలపెట్టడం లేదా దీని ద్వారా మరణాలూ సంభవిస్తాయని స్పష్టం చేశారు. సైబర్ సెక్యూరిటీలో సరికొత్త లోపాలను ఏఐ వ్యవస్థలు కనిపెట్టే ప్రమాదం ఉందని, బయాలజీలో నూతన ఆవిష్కరణలకు బాటలు వేస్తాయని అన్నారు.