టీటీడీ ట్రస్టులకు రూ.7.64 లక్షల విరాళం ఇచ్చిన ఎన్ఆర్ఐ
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ట్రస్టుకు రూ.7.64 లక్షలు విరాళంగా అందాయి. రష్యాకు చెందిన అచ్యుత మాధవదాసు అనే ఎన్ఆర్ఐ తరపున ఆయన స్నేహితుడు కన్నయ్యదాస్ టీటీడీ పరిపాలన భవనంలో ఈవో ధర్మారెడ్డికి విరాళాల డీడీలను అందజేశారు. ఇందులో ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.1.64 లక్షలు, అన్నప్రసాదం, గోసం రక్షణ, ప్రాణదాన, విద్యాదానం, వేదపారాయణ ట్రస్టు, బాలజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీంలకు రూ.లక్ష చొప్పున విరాళం అందించారు.
Tags :