ముందస్తుకు వెళితే.. ముందుగానే ఇంటికి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారని, అలాగైతే ఆయన ముందుగానే ఇంటికి వెళ్లిపోతారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ అన్నారు. విశాఖలో పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వివేకా హత్య కేసును మూడేళ్లుగా దర్యాప్తు చేస్తూ సీబీఐ తీవ్ర అప్రతిష్ట మూటగట్టుకుందన్నారు. ఆంధ్రప్రదేశ్కి చాలా చేశామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఏ నోటీతో చెబుతారన్నారు. ప్రధాని మోదీ అంటే భయంతోనే ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తున్నా టీడీపీ, వైసీపీ నాయకులు చెప్పడం లేదన్నారు. కేసుల నుంచి తప్పించుకోవడానికే జగన్ మోదీ భజన చేస్తున్నారని విమర్శించారు.
Tags :