Radha Spaces ASBL

మార్చి 14 తర్వాతే చిన్నారులకు

మార్చి 14 తర్వాతే చిన్నారులకు

భారత ప్రభుత్వం ఈ మధ్యే టీనేజర్లకు కరోనా వ్యాక్సినేషన్‌ ప్రారంభించింది. టీనేజర్ల వ్యాక్సిన్‌ ప్రక్రియ మార్చి నాటికి పూర్తవుతుందని 12 నుంచి 14 ఏళ్లవారికి కొవిడ్‌ 19 వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఆ తర్వాత నుంచే ప్రారంభిస్తారని ఎన్టాగీ చీఫ్‌ డా.ఎన్‌కే అరోరా వెల్లడించారు. జనాభాలో 15న 18 ఏళ్ల వయసు వారు సుమారు 7.4 కోట్ల మంది ఉన్నారని వారిలో దాదాపు 3.45 కోట్లమందికి కోవాక్సిన్‌ తొలిడోసు వేసారని అన్నారు. తదుపరి డోసు మరో 28 రోజుల్లో ఇస్తారని ఎన్టాగీ చీఫ్‌ తెలిపారు. కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ దృష్టిలో పెట్టుకుని ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బంది నుంచి 60 ఏళ్లు పైబడిన అందరికోసం ముందు జాగ్రత్త చర్యగా ప్రికాషనరీ వ్యాక్సినేషన్‌ను ఈ నెల 10 నుంచి ప్రారంభించింది.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :