ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఏపీ సేవ 2.0 ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్

ఏపీ సేవ 2.0 ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్

ఏపీ సేవ 2.0 పోర్టల్‌ను తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలనలో మరింత వేగం, పారదర్శకత, జవాబుదారీతనం కోసం సిటిజన్‌ సర్వీసెస్‌ పోర్టల్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. ప్రజలు పలకడానికి అనువుగా ఉండేందుకు పోర్టల్‌కు ఏపీ సేవ అని పేరు పెట్టినట్లు తెలిపారు. గ్రామస్వరాజ్యంలో ఏపీ సేవ పోర్టల్‌ ఓ గొప్ప ముందడుగని అన్నారు. దీనిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. పోర్టల్‌తో మారుమూల గ్రామాల్లోనూ పారదర్శకత, జవాబుదారీతనం  పెరుగుతుందన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 540కి పైగా సేవలను అందిస్తున్నట్లు తెలిపారు.

ఈ పోర్టల్‌ ద్వారా రెవెన్యూ, భూపరిపాలనకు సంబంధించిన దాదాపు 35 రకాల సేవలను అదనంగా తీసుకొచ్చామన్నారు. మున్సిపాలిటీలకు చెందిన 25, పౌరసరఫరాలకు చెందిన 6, గ్రామీణాభివృద్ధి, విద్యుత్‌ రంగానికి చెందిన 53కు పైగా సేవలు ఈ పోర్టల్‌ కిందికి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఏపీ సేవ పోర్టల్‌తో మారుమూల గ్రామాల్లోనూ వేగంగా ప్రభుత్వ పథకాలు అమలవుతాయని తెలిపారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :